సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా...?

murali krishna
విజయ్ దేవరకొండ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ను సాదించాడు. వరుస ప్లాప్స్ వచ్చినా కూడా ఈయన క్రేజ్ అస్సలు తగ్గలేదు.. ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు ఈ సినిమా భారీ షాక్ ను అయితే ఇచ్చింది..
ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి బయట పడి మెల్లగా తన లైనప్ ను అయితే సెట్ చేసుకుంటున్నాడని సమాచారం...ప్రెజెంట్ విజయ్ దేవరకొండ ఒకే ఒక్క సినిమా చేస్తున్నాడు... శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా ను చేస్తున్నాడు విజయ్.. అయితే ఈ సినిమా ఎప్పుడో లైగర్ రిలీజ్ ముందు నే ఆగిపోయింది. ఇంత వరకు తిరిగి స్టార్ట్ అయితే కాలేదు. సమంత హెల్త్ కారణంగా ఈ సినిమా ప్రెజెంట్ వాయిదా పడిందని సమాచారం... దీంతో విజయ్ ఈ ఖాళీ సమయాన్ని తన తర్వాత సినిమాలను సెట్ చేసుకునేందుకు వాడుకుంటున్నాడని సమాచారం..
ఇప్పటికే విజయ్ ముగ్గురు డైరెక్టర్లను ఓకే చేసినట్టు సమాచారం.. విజయ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేసేందుకు రెడీ అయినట్టు కూడా టాక్ వచ్చింది.. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్టు సమాచారం.అలాగే గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కూడా ఇటీవలే విజయ్ కు కథ చెప్పగా ఈయన గ్రీన్ సిగ్నల్ ను ఇచ్చినట్లు తెలుస్తుంది.
అలాగే కన్నడ డైరెక్టర్ నర్తన్ కూడా విజయ్ తో సినిమా చేసేందుకు ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నడంటూ కూడా వార్తలు వస్తున్నాయి.. ఈ మూడు సినిమాల కంటే ముందే విజయ్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉంది అని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ప్రెజెంట్ సుకుమార్ పుష్ప 2 తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఇది సాధ్యం అవ్వడం అయితే కష్టమే.. దీంతో విజయ్ సుకుమార్ మీద ఆశలు వదులుకుని నెక్స్ట్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు అని సమాచారం.. మరి వీరి కాంబో కొన్నాళ్ళ తరువాత అయినా ఉంటుందో లేక కాలక్రమేణా ఆ సినిమా ఆగిపోతుందో వేచి చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: