ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది : సన్నీలియోన్

murali krishna
ఇండియా లోని అన్ని ఇండస్ట్రీలలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న సన్నీ లియోన్ వయస్సు పెరుగుతున్నా కానీ వరుస ఆఫర్లతో బిజీ బిజీగా అవుతూ తోటి హీరోయిన్ లకు షాకిస్తున్నారు.
అయితే సన్నీ లియోన్ తనకు 20 సంవత్సరాల వయస్సులో ఎదురైన చేదు అనుభవం గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను అయితే వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీలోకి తాను అడుగు పెట్టిన కొత్తలో తనకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయని సన్నీ లియోన్ అన్నారట.. కొంతమంది ఆమెను చెంపేస్తామని చెబుతూ తనకు బెదిరింపు కాల్స్ చేసేవారని సన్నీ లియోన్ కామెంట్లు కూడా చేశారు. ఈ మెసేజ్ లలో ఎక్కువ మెసేజ్ లు భారత్ నుంచి వచ్చినవే అని ఆమె చెప్పుకొచ్చినట్లు సమాచారం.ఆ సందేశాల వల్ల భారతదేశంలోని ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని నాకు అర్థమైందని సన్నీ లియోన్ కామెంట్లు కూడా చేశారు.
ఆ బెదిరింపుల వల్ల నేను ఎంతో భయాందోళనకు గురయ్యానని ఆమె అన్నారు. అప్పుడు నా వయస్సు 20 సంవత్సరాలు అని ఆ సమయంలో నాకు మంచి ఏదో చెడు ఏదో అస్సలు తెలియదని సన్నీ లియోన్ పేర్కొన్నారు. ఆ సమయంలో నాకు ఏ విధంగా చేస్తే మంచిదో చెప్పేవారు కూడా ఎవరూ లేరని సన్నీ లియోన్ కామెంట్లు చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఎదురైతే నేను ఎక్కువగా అయితే ఎఫెక్ట్ కానని సన్నీ లియోన్ అన్నారు.
ప్రస్తుతం నేను మానసికంగా ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నానని సన్నీలియోన్ అయితే చెప్పుకొచ్చారు. సన్నీ లియోన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. సన్నీ లియోన్ ఈ ఏడాది జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే . జిన్నా సినిమా బాక్సాఫీస్ వద్ద అశించిన ఫలితాన్ని  అయితే సొంతం చేసుకోలేదు. రాబోయే రోజుల్లో సన్నీ లియోన్ టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: