'అన్‌స్టాపబుల్-2' షో లో ముగ్గురు హీరోయిన్లు..బాలయ్య చిలిపి పనులుతో..

Satvika
అలనాటి అందాల ముద్దుగుమ్మలు జయప్రద, జయసుధ చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసి కనిపించబోతున్నారు. సినిమాలో మాత్రమే కాదండోయ్ బాలకృష్ణ షో 'అన్‌స్టాపబుల్-2' లో వీరిద్దరూ కలిసి వస్తున్నారు. వీరితోపాటు నటి రాశీ ఖన్నా కూడా సందడి చేయనుంది. ఈ ట్రిపుల్ ధమాకా షో త్వరలోనే 'ఆహా' ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి న అప్‌డేట్‌ను 'ఆహా' సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

త్వరలోనే ప్రోమోను కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్-2' ఓటీటీ రికార్డులను బద్దల కొడుతోంది. అత్యంత వ్యూస్ కలిగిన ఓటీటీ షోగా దూసుకెళ్తోంది. త్వరలో టాలీవుడ్ ఫ్రెండ్స్ ప్రభాస్, గోపీచంద్ సైతం బాలయ్య తో కలిసి రచ్చ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే ప్రభాస్, గోపీ చంద్‌ల ప్రోమో యూట్యూబ్‌ లో ట్రెండవుతోంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30 వ తేదీన ప్రీమియర్ కానుంది..

బుజ్జిగాడు సినిమా లో ప్రభాస్ కామెడీ టైమింగ్ మళ్లీ ఈ గ్లింప్స్‌ లో కనిపించింది. చివర్లో 'ఏవండీ... ఒక పాట పాడండి.' అంటూ ఈ ప్రోమోను ముగించారు. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కూడా ఒక ఎపిసోడ్‌ కు రానున్నట్లు తెలుస్తోంది. దీన్ని 'ఆహా', సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్ నాగవంశీ ఇప్పటికే టీజ్ చేశారు. 27వ తేదీన ఈ ఎపిసోడ్ షూట్ జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ వచ్చారు. ఆ తర్వాత ఎపిసోడ్లకు అడివి శేష్, శర్వానంద్ ఒక ఎపిసోడ్‌ కు, విష్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఒక ఎపిసోడ్‌కు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాధిక ఒక ఎపిసోడ్‌ కు విచ్చేశారు.. చివరి ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: