టిల్లు స్క్వేర్ మూవీ నుండి ఆ హీరోయిన్లు తప్పుకోవడానికి కారణం అదేనా..?

Pulgam Srinivas
సిద్దు జొన్నలగడ్డ హీరోగా తేరకెక్కిన డీజే టిల్లు మూవీ ఏ రేంజ్ విజయాన్ని ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల అయిన డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్ , డ్రెస్సింగ్ స్టైల్ , డైలాగ్ డెలివరీ అన్ని కూడా యువతను బాగా ఆకట్టుకునే విధంగా ఉండడం తో డిజె టిల్లు మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండే భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ కి బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. ఈ మూవీ ద్వారా సిద్దు జొన్నలగడ్డ కు సూపర్ క్రేజ్ కూడా లభించింది.

ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ మూవీ కి సీక్వల్ గా టిల్లు స్కేర్ అనే మూవీ ని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. మొదట ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల  ను ఈ మూవీ యూనిట్ హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ ముద్దు గుమ్మను ఈ మూవీ లో హీరోయిన్ గా తీసుకోలేదు. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ను ఈ మూవీ లో హీరోయిన్ గా ఈ మూవీ యూనిట్ ఎంపిక చేసుకుంది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ మూవీ నుండి తప్పుకుంది. ఆ తర్వాత మడోనా సభాష్టియన్ ను ఈ మూవీ లో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ కూడా ఈ మూవీ లో నటించడం లేదు. ఆఖరి కి మీనాక్షి చౌదరి ని ఈ మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత మంది హీరోయిన్ లు ఈ మూవీ నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ లో కిస్ మరియు హగ్ సీన్స్ ఉండటమే అని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: