"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన "మసుద" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటి మనులాలో ఒకరు అయినటు వంటి సంగీత తాజాగా మసుద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు . ఈ మూవీ ని హర్రర్ కథాంశంతో సాయి కిరణ్ తేనెకెక్కించాడు. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో మసుధ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి. దానితో మసుధ సినిమా అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ స్టేటస్ ను అందుకొని లాభాలను కూడా అందుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన మసుద మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని డిసెంబర్ 16 వ తేదీన లేదా డిసెంబర్ 23 వ తేదీన ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా మసుధ సినిమా ధియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అలాగే ఈ మూవీ ప్రస్తుతం కూడా డీసెంట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: