నా వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదు... రష్మిక..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమానులలో ఒకరు అయినటు వంటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రష్మిక మందన పుష్ప పార్ట్ 1 మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో పుష్ప పార్ట్ 1 మూవీ ద్వారా రష్మిక మందన కు పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు తమిళ , హిందీ మూవీ లలో కూడా నటిస్తూ వస్తుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా రష్మిక మందన ను కన్నడ సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేయబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై రష్మిక మందన స్పందించింది. కాంతారా మూవీ విషయంలో కొందరు నాపై చాలా అత్యుత్సాహన్ని చూపించారు. కాంతారా మూవీ చూసి మూవీ యూనిట్ కు మెసేజ్ చేశాను. మా మధ్య ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. నా పర్సనల్ విషయాలను బయట పెట్టలేను. ఆ  మెసేజ్ లను కూడా బయటకు విడుదల చేయలేను. నా వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదు అని తాజాగా రష్మిక మందన తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: