రాజమౌళి - మహేష్ బాబు కాంబో సినిమాపై లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ ఖుషీ..!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమా షూటింగ్లలో పాల్గొనలేకపోతున్న విషయం తెలిసిందే. ఇదే ఏడాది అన్న రమేష్ బాబును, సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరా దేవిని , నవంబర్ నెలలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ను కోల్పోవడం నిజంగా ఆయనకు తీరని దుఃఖం మిగిల్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్న మహేష్ బాబు.. వెంటనే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిన నేపథ్యంలో త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మహేష్ బాబు సినిమా షూటింగ్లలోకి వస్తే మహేష్ బాబు ఆ బాధ నుంచి బయటపడతాడు అని అభిమానులు ఆకాంక్షిస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే డిసెంబర్ 8వ తేదీ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే ప్రారంభం అయ్యేటట్లు కనిపించడం లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేయాలని షరతులు త్రివిక్రమ్ పై ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మహేష్ బాబు తన తదుపరిచిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.  పాన్ ఇండియా సినిమా గా  రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆఫ్రికా అడవుల్లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో చిత్రం తెరకెక్కుతోంది అని.. తప్పకుండా మహేష్ బాబు కెరియర్ లోనే బెస్ట్ ఫిలిం గా నిలవబోతోంది అంటూ ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇప్పటికే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ వైరల్ గా మారుతోంది.భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖ హాలీవుడ్  స్టూడియో #SSMB 29 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడానికి సహకరించినట్లు సమాచారం.  అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: