విజయ్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నా దిల్ రాజు..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు పొందిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటు వంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి , ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్నాడు. దిల్ రాజు తన కెరీర్ లో ఇప్పటివరకు ఎంతో మంది చిన్న దర్శకులతో సినిమాలను తెరకెక్కించి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. అలాగే స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా అద్భుతమైన  క్రేజ్ ను సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను నిర్మిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పన్ ఇండియా మూవీ ని తెరకెక్కిస్తున్నాడు  ఈ మూవీ కోసం దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు అనే ఓ భారీ బడ్జెట్ మూవీ ని కూడా రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ,  బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహారెడ్డి మూవీ లు కూడా విడుదల కాబోతున్నాయి. ఆ మూవీ లతో పాటు వారసుడు మూవీ ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలి అని దిల్ రాజు ప్లాన్ చేశాడు. అలా వారసుడు మూవీ కి పోటీగా రెండు భారీ సినిమాలు ఉండడంతో ప్రస్తుతం దిల్ రాజు "వారసుడు" సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ లను కేటాయించే ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: