"ఓటిటి" లో విడుదల కాకముందే బుల్లితెరపై ఆరోజు ప్రసారం కానున్న "మాచర్ల నియోజకవర్గం" మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి నితిన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా , కృతి శెట్టి ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయిన ఈ సినిమా ఇప్పటివరకు "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ మూవీ  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. సోనీ మ్యాక్స్ ఛానల్ ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ ను హిందీ లో ప్రసారం చేయనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా సోనీ మ్యాక్స్ సంస్థ విడుదల చేసింది. మాచర్ల చునావ్ క్షేత్రం (MCK) పేరుతో ఈ మూవీని డిసెంబర్ 11, 2022న రాత్రి 8 గంటలకు ప్రీమియర్‌ గా సోనీ మ్యాక్స్ ఛానల్ లో ప్రసారం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: