చనిపోయేముందు సూపర్ స్టార్ బాధ వర్ణనాతీతం?

Purushottham Vinay
సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలుగు ఇండస్ట్రీలో ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ.దేనికి కూడా భయపడని వ్యక్తిత్వం కృష్ణది. డబ్బు పోయినా అసలేం పట్టించుకోరు. ఆయన ఎక్కువగా డబ్బు కంటే అనుబంధాలకు పెద్ద పీట వేసేవారు. ఎప్పుడూ కూడా తనతో తన చుట్టూ జనం ఉండాలని.. పండగొచ్చినా, పుట్టినరోజులొచ్చినా అందరూ కూడా ఒకే చోట చేరి, కలిసి భోజనం చేయాలని కోరుకునేవారు.అలాంటి సూపర్  స్టార్ కృష్ణ చివరి రోజుల్లో కాస్త ఒంటరితనంని అనుభవించారు.ఆయన ఎంతగానో ఇష్టపడినవాళ్లంతా ఒకొక్కరుగా వెళ్లిపోవడం ఆయన్ని బాగా కలిచి వేసింది. తన సహచరిణి ఇంకా యాభై ఏళ్లుగా చేయి వదలని విజయ నిర్మల మూడేళ్ల క్రితమే కన్నుమూయడం ఆయన్ను ఎంతగానో కుంగదీసింది. ప్రతి చిన్న విషయానికీ కృష్ణ విజయ నిర్మల సలహా తీసుకొనేవారని, దాని ప్రకారమే ఆయన నడుచుకొనేవారని కృష్ణ సన్నిహితులు చెబుతుంటారు.అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా తన జీవితంలోంచి వెళ్లిపోవడం అనేది సూపర్‌ స్టార్‌ జీవితంలో పెద్ద వెలితిగా మారింది.


ఇక ఈ 2022లో అయితే కృష్ణను ఇంకా వరుస విషాదాలు చుట్టిముట్టాయి. ఆయన పెద్ద కుమారుడు రమేశ్‌బాబు అనారోగ్యంతో పోరాడి ఈ ఏడాది ప్రారంభంలో కన్నుమూశారు.ఇక కొద్దిరోజుల క్రితమే..కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరా దేవి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఒంటరితనంతో బాగా కుంగిపోయిన కృష్ణను.. మహేశ్‌, నమ్రత, నరేశ్‌ ఇంకా కుటుంబ సభ్యులు  వీలైనంత ఎక్కువగా అంటిపెట్టుకొని ఉండేవారు. వారంతా కూడా ఆయనతో వారానికి ఒకసారైనా కలిసి భోజనం చేయడం అలవాటుగా మార్చుకొన్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆయనకి ఎంతో ఆప్తుల మరణాలు కృష్ణని బాగా కృంగదీశాయని, ఇది వరకటిలా ఆయన ఉత్సాహంగా కనిపించేవారు కాదని సన్నిహితులు చెబుతున్నారు.ఇన్ని బాధలు వల్ల ఆయన కుంగిపోయి చనిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: