పుష్ప 2 అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆందోళన...

Satvika
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినెషన్ లో వచ్చిన సినిమా పుష్ప.. పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యి ప్రభంజనా న్ని సృష్టించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ ను కూడా అందుకుంది. అల్లు అర్జున్ సరి కొత్త లుక్ తో కనిపించి అందరినీ ఆకర్షించాడు.. ఇప్పుడు ఆ సినిమా కు సీక్వెల్ గా పుష్ప 2 ను తెరకెక్కిస్తున్నారు.. మొదటి సినిమా ను బీట్ చేస్తూ ఈ సినిమా కథ ఉండబొతుందని తెలుస్తుంది.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా 'పుష్ప-ది రైజ్'.
 

ఒక తెలుగు సినిమా గా వచ్చి మొత్తం దేశాన్ని తన వైపు తిప్పు కోవడమే కాకుండా, తగ్గేదెలా అనే మ్యానరిజం తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది.. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది గడుస్తున్నా పుష్ప-ది రూల్ షూటింగ్ ఇంకా పట్టాలు ఎక్కలేదు. మొదటి భాగం అఖండమైన విజయాన్ని అందుకోవడం తో దర్శకుడు సెకండ్ పార్ట్ ని చాలా పకడ్బందీ గా ప్లాన్ చేస్తున్నాడట. నిర్మాతలు కూడా ఏ విషయం లోనూ కాంప్రమైజ్ కాకుండా, ఎంత బడ్జెట్ అయినా కూడా ఓకే అంటు లెక్కల మాస్టర్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారట..

అయితే సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నేడు పుష్ప 2 అప్డేట్స్ వెంటనే ఇవ్వాలంటూ గీతా ఆర్ట్స్ ముందు ఆందళోనకు దిగారు. పుష్ప రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తున్నా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు, ఇంకా లేట్ చేస్తే మైత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటూ ఫ్యాన్స్ అల్టి మేటమ్ జారీ చేసారు. మరి ఈ విషయం పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: