మరో వివాదంలో కాంతార..కలెక్టర్ కు వినతి..

Satvika
కాంతార సినిమా గురించి ఇప్పుడు ఎక్కడ చూసిన చర్చలు జరుగుతున్నాయి.ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా లెవల్లో మంచి వసూళ్లతో దూసుకుపోతుంది కాంతార. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.ఈ మూవీ అద్భుతంగా ఉందని.. దైవం ఆవహించిన సమయంలో రిషబ్ నటన గూస్‏బంప్స్ అంటూ కాంతార పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఓవైపు ఈ థియేటర్లలో సక్సెస్‏ఫుల్‏గా రన్ అవుతుంటే.. మరోవైపు వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీలో వరాహ రూపం సాంగ్ మ్యూజిక్ కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన తుక్కుడం బ్రిడ్జ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన స్థానిక కోర్టు.. థియేటర్లలో వరహ రూపం సాంగ్ ప్లే చేయకూడదని.. అలాగే ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో సాంగ్ ప్లే చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పుడు కాంతార చిత్రం మరో వివాదంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా సూపర్ హిట్ నాలికే , పంబడ , పరవ వర్గాలను అవమానించారని ఆరోపిస్తూ ప్రదర్శనను నిలిపివేయాలని దళిత సంఘాలు దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాయి . ఇక సినిమాలో అబ్బాయిలు చెడు భాష మాట్లాడతారు. కానీ అలాంటి చెడ్డ శబ్దాన్ని డ్యాన్సర్ కుటుంబంలో ఉపయోగించరని.. ఊరు మాస్టారు చనిపోయిన భర్త కోసం నేనున్నాను అని చెప్పడం బాధాకరం. ధని పేద అమ్మాయి ఇంటికి వెళుతున్నప్పుడు హీరో చూస్తూ ఉంటాడు. మేము అభివృద్ధి చెందుతున్నంత తక్కువ స్థాయికి వెళ్ళాము.

సమతా సైనికదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోలాక్ష మాట్లాడుతూ విదేశాల్లో దీన్ని భారతీయ సంస్కృతిగా పేర్కొనడం విషాదకరమన్నారు.అట్టడుగు వర్గాలకు చెందిన యువకులను చెడుగా చూపించారు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారని చిత్రీకరించారు. దళితులనే కాకుండా దివ్య నృత్య కళాకారుల కుటుంబాలను కూడా అవమానించారు. కాంతారావు ను సెన్సార్ బోర్డు మరోసారి సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: