తెలుగు చిత్ర దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. తాజాగా ఈయన గురించి మరో వార్త చక్కర్లు కొడుతోంది.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స కోసం తన వంతు సాయం అందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జనుపల్లెకు చెందిన ఆనంద్ గత కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్నాడు. అతని స్నేహితులు ఆనంద్ చికిత్స కోసం డబ్బులు ఎవరైనా సాయం చేయగలరంటూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు.
దాన్ని చూసిన డైరెక్టర్ సుకుమార్ అతనికి రూ.50వేల ఆర్థికకసాయం చేశారు. సినిమాల్లోనే కాదు సేవా కార్యక్రమా ల్లోనూ ముందుంటాడు సుకుమార్. ఇప్పుడే కాదు గతంలోనూ పలు సేవా కార్యక్రమా ల్లో పాలు పంచుకున్నారాయన. తన స్వస్థలం మట్ట పర్రు గ్రామంలో తన సొంత నిధుల తో పాఠశాల ను ఏర్పాటు చేశాడు. చుట్టు పక్కల గ్రామాల్లోనూ తన తండ్రి పేరు తో పలు స్కూల్స్, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక కరోనా కాలంలోనూ రూ.లక్షలు ఖర్చు చేసి బాధితుల కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆహార సదుపాయాలు సమకూర్చారు.
ఇక సినిమా ల విషయానికొస్తే.. అల్లు అర్జున్ పుష్ప తో పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు సుకుమార్. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈచిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. బన్నీ యాక్టింగ్కు తోడు సుకుమార్ టేకింగ్ పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ఇదే కు పుష్ప 2.. దిరూల్ పేరుతో సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్కు మించిన కథా కథనాలు, గ్రాండ్నెస్తో పుష్ప2 ను తెరకెక్కించనునట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి..