విక్రమ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత లోకనాయకుడిలో మునుపెన్నడూ లేనంత జోరు కనిపిస్తోంది. ఆ మూవీ ఇచ్చిన కిక్కుతో ఆయన వరుసగా భారీ సినిమాలు చేస్తూ, ఇక కమల్ కెరీర్ అయిపోయింది అన్న వాళ్లకు అయితే షాకుల మీద షాకులిస్తు ఆశ్చర్య పరుస్తున్నాడు కమల్.తన 234 వ సినిమా మణిరత్నం డైరెక్షన్లో ఉండబోతుందని లేటెస్ట్గా అనౌన్సయింది. కమల్ హాసన్ హీరోగా లెజెండరీ మణిరత్నం తెరకెక్కించిన నాయగన్ సినిమా అయితే అప్పట్లో పెద్ద హిట్ అయ్యి ఇండియన్ హిస్టరీలో నిలిచే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.మళ్లీ ఇన్నాళ్లకు అంటే దాదాపు 35 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరు మళ్ళీ రావడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ కూడా అవడంతో మూవీ లవర్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరోవైపు భారీ సినిమాల దర్శకుడు శంకర్ డైరెక్షన్లో భారతీయుడు 2 మూవీ షూట్ కూడా అడ్డకుంలొచ్చినా ఆగకుండా ఇంకా జరుగుతూనే ఉంది.
భారతీయుడు సినిమా వచ్చిన 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే లుక్స్ తో సీక్వెల్ అనేది వస్తుండడంతో అన్ని జనరేషన్ల ఆడియెన్స్లో కూడా హైప్ భారీగా ఉంది.కమల్ కేవలం మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్ డైరెక్టర్లతోనే కాదు, ఇప్పుడు యంగ్ మేకర్స్తో కూడా వరుసగా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. విక్రమ్ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే సీక్వెల్ రావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో పార్టయిన ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా టైమ్ ఉండడంతో మిగతా కొత్త సినిమాలకు కమల్ ఓకే చెప్తున్నాడు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం కమల్ లా వరుస సినిమాలు చేయకుండా అభిమానులను నిరాశపరుస్తున్నాడు. తన తోటి హీరో వరుసగా సినిమాలు చేస్తుంటే రజినీకాంత్ మాత్రం కేవలం ఒక్క సినిమానే చేస్తున్నాడు. దీంతో రజిని ఫ్యాన్స్ కొంచెం నిరాశలో వున్నారు. రజినీకాంత్ ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో "జైలర్" అనే సినిమా చేస్తున్నాడు.