మరోసారి తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు తో పనిచేయనున్న నితిన్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో వెంకీ కుడుముల ఒకరు . ఈ యువ దర్శకుడు నాగ శౌర్య హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఛలో మూవీ తో దర్శకుడి గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు . ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు . ఛలో మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వెంకీ కుడుముల కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది . ఆ తర్వాత ఈ దర్శకుడు నితిన్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా భీష్మ అనే మూవీ ని తెరకెక్కించాడు .

మంచి అంచనాల నడుమ విడుదల అయిన భీష్మ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . ఇలా వరుస గా రెండు మూవీ లతో , రెండు విజయాలను అందుకున్న ఈ దర్శకుడి కి మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశం లభించింది . ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కాక పోతే వెంకీ కుడుముల మరియు చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయినట్లు తెలుస్తుంది . దానితో వెంకీ కుడుముల ,  నితిన్ హీరోగా ఓ మూవీ ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే వెంకీ కుడుముల తాజాగా నితిన్ కు ఓ కథను వినిపించగా ,  నితిన్ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ మరియు వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: