బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీలో మెరిసిపోతున్న ప్రియమణి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రియమణి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన విషయం మన అందరికీ తెలిసిందే. పెళ్లయిన కొత్తలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ప్రియమణి ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన యమదొంగ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయింది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రియమణి వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ప్రియమణి , నాగ చైతన్య ,  వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. సినిమాలతో పాటు ప్రియమణి పలు బుల్లి తెర ప్రోగ్రాం లకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ఇలా సినిమాలతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ప్రియమణి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు ప్రియమణి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ప్రియమణి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రియమణి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న సారీ ని కట్టుకొని ,  బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ప్రియమణి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: