వావ్: ప్రిన్స్ అనే పేరుకు తగ్గట్టుగా పనులు చేస్తున్న మహేష్..!!

Divya
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం స్టార్ హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరిని చెప్పవచ్చు. మహేష్ బాబు నటించిన గత చిత్రాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటూ ఉన్నాయి. ఇక ఈ ఏడాది సర్కారు వారి పాట చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు ఇక ఈ సినిమాలో మహేష్ బాబును డైరెక్టర్ పరుశురాం సరికొత్త లుక్ లో చూపించారు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు అందం మాత్రం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటించింది.

దీంతో అటు కీర్తి సురేష్ కెరియర్కు కూడా ఈ సినిమా ప్లస్ అయ్యిందా చెప్పవచ్చు. తాజాగా త్రివిక్రమ్ తో కలిసి 28వ సినిమాని వచ్చేయేడాది ఏప్రిల్ 28న విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు తన సంపదలో కొంత భాగాన్ని పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పటికే అనేకమంది చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు చేయించారు. ఇక గతంలో కూడా తను దత్తకు తీసుకున్న బుర్రిపాలెం అనే గ్రామంలో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.

ఇక మహేష్ బాబు తాజాగా మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బుర్రిపాలెం గ్రామంలో సర్కార్ బడిలో డిజిటల్ లెర్నింగ్ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ఫౌండేషన్ సహాయాన్ని అందించడం జరిగింది. ఈ విషయం గొర్రెపాలెం పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంటూ మహేష్ కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది దీంతో సోషల్ మీడియా ద్వారా ఈ న్యూస్ వైరల్ కావడంతో అటు అభిమానులు తమ హీరో చేసిన మంచి పనికి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: