టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు మూవీ లో నితిన్..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నితిన్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి అనేక విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే నితిన్ , ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ లో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా మాచర్ల నియోజకవర్గం మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ ను ఎదుర్కొన్న నితిన్ మరికొన్ని రోజుల్లో వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే నితిన్ ,  వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తర్వాత మరో క్రేజీ దర్శకుడు మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే నితిన్ ,  వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తర్వాత టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ నితిన్ కెరియర్ లో 33 వ మూవీ గా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి ,  అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: