ఇన్ని రోజుల తర్వాత పెళ్లి నాటి జ్ఞాపకాలు పంచుకుంటున్న స్టార్ హీరోయిన్...!!

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట ఇష్టం చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ శ్రియ శరన్. అటు తర్వాత సంతోషం ,నువ్వే నువ్వే , ఠాగూర్ తదితర సినిమాలలో నటించి తెలుగు లో స్టార్ హీరో యిన్ రేంజ్ లో పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల లో కూడా నటించింది అలాగే యువ హీరోల తో కూడా నటించిన ఘనత శ్రియ కే దక్కిందని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉండగా 2018లో రష్యా టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కోశ్చివ్ రహస్యం గా వివాహం చేసుకుంది. అటు తరువాత 2021 లో కూతురికి జన్మనిచ్చింది.
అప్పుడే శ్రియకు వివాహమైందని విషయం బయటికి రావడం జరిగింది. అయితే తాజాగా తన పెళ్లినాటి జ్ఞాపకాలను మరొకసారి గుర్తుకు చేసుకున్నది శ్రియ.అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ రోజున శ్రియ తల్లితండ్రుల పుట్టినరోజు కావడంతో వారికి ఇంస్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తన పెళ్లిలో దిగినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక అమ్మానాన్న మీ ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఈ ప్రపంచంలో ఉత్తమమైన తల్లితండ్రులు మీరు మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని ఫోటో కింద క్యాప్షన్ తెలియజేస్తూ పోస్ట్ చేసింది. ఇక చివరిగా శ్రియ rrr చిత్రంలో అజయ్ దేవగన్ తో కలిసి కనిపించింది. అలాగే బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ తో కలిసి దృశ్యం 2 సినిమాలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఇక దీంతోపాటు కన్నడలో కూడా ఉపేంద్ర తో కబ్జా అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: