ప్రభాస్ కోసం ఏకంగా 5 హాలీవుడ్ డైరెక్టర్లు?

Purushottham Vinay
మన డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. 'సాహో', 'రాధేశ్యామ్' వంటి బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ ఫేయిల్యూర్స్‌ ప్రభాస్ ఫ్యాన్స్‌ను చాలా తీవ్రంగా నిరాశపరిచాయి.ఆ మచ్చలను పొగట్టడానికి ప్రస్తుతం ప్రభాస్ ఓ బాహుబలి లాంటి భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్‌-K’ ఒకటి. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. అయితే ఇటీవలే కొందరు నెటీజన్లు ఈ సినిమా కథ, ‘ఓకే ఒక జీవితం’ కథకు సిమిలర్‌గా ఉంటుంది అని కామెంట్స్ చేశారు. దానికీ నాగ్ అశ్విన్ తన దైన స్టైల్లో కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.సై-ఫై జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యూచర్ గురించి ఉంటుందని, వరల్డ్ వార్-3 టైమ్ లైన్‌లో ఈ సినిమా జరుగుతుందని తెలుస్తుంది.


ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ సినిమాగా గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో 5 మేజర్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఇక ఈ ఐదు యాక్షన్ సీన్స్ కోసం ఐదుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌లను మేకర్స్ తీసుకున్నారట. త్వరలోనే యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ లేదంటే 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నాడట. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది.బ్లాక్ బస్టర్ ‘తానాజీ’ ఫేం ఓ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. దీనితో పాటుగా కన్నడ టాప్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రాన్ని చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: