ఇప్పటికైనా ఈ ముద్దుగుమ్మను పట్టించుకుంటారా..!!

Divya

హీరోయిన్ హెబ్బా పటేల్. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. మొదట అధ్యక్ష అనే చిత్రం ద్వారా కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అలా ఎలా అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ ఆ తర్వాత హీరో రాజ్ తరుణ్ తో కలిసి కుమారి -21ఎఫ్ సినిమాలో నటించగా ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులోని నటనకు యువత సైతం ఫిదా అయిపోయారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సైతం తెలుగు ఇండస్ట్రీ లోకి మరొక హాట్ హీరోయిన్ దొరికిందని భావించారు. అయితే ఈ చిత్రం తర్వాతే ఈమెకు వరుస అవకాశాలు వెల్లువడ్డాయి. రెండు మూడు సినిమాలు తప్ప మిగతా సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ ని ఇచ్చాయి.

దాదాపుగా ఐదు సంవత్సరాల వరకు ఈమెకు చెప్పుకోదగ్గ హిట్ లేవని చెప్పవచ్చు. దీంతో ఈమె కెరియర్ డౌన్ అయిపోయింది. ఆఫర్లు కూడా పూర్తిగా తగ్గిపోయాయి అయితే తాజాగా ఈమె నటించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు ఓటీటి లో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం ఒక యదార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ అశోక్ తేజ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వశిష్ట సింహ,  పూజిత పొన్నాడ, సాయి రోనక్ తదితరులు నటించారు.

ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది కథ , స్క్రీన్ ప్లేను అందించారు. ఈ నెల 26న ఈ సినిమా ఆహా లో డైరెక్ట్ గా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది దీంతో ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబట్టుకున్నట్లు సమాచారం . కెరియర్ మొదట్లో ఎక్కువగా ఈమె గ్లామర్ పాత్రలలోనే నటించింది. తొలిసారిగా డీ గ్లామరస్ పాత్రలో ఈ సినిమాలో నటించి మరింత క్రేజ్ ను సంపాదించింది. దీంతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకట్టుకుంటుంది  ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: