రాక్షసుడు2: హీరో, విలన్లుగా ఆ ఇద్దరు స్టార్లు?

Purushottham Vinay
బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమా అతనికి మంచి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ సినిమా రటసన్ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.అల్లుడు శ్రీను సినిమా తరవాత బెల్లంకొండ శ్రీనివాస్ కు హిట్ అందించిన సినిమా ఇది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనివాస్ కి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ అని ప్రకటించిన దగ్గర నుంచి ప్రేక్షకులలో చాలా ఆసక్తి మొదలైంది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ లో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది.అయితే మొదటి పార్ట్ లో నటించిన బెల్లంకొండనే ఈ సినిమాలో కూడా హీరోగా చేస్తారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు తాజాగా మరో హీరో పేరు కూడా వినిపిస్తోంది. ఇక రాక్షసుడు సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు దర్శకుడు రమేష్ వర్మ లీడ్ రోల్ లో మరో పెద్ద హీరోని తీసుకోవాలనుకున్నారు.


ఈ మేరకు చాలా మంది హీరోల పేర్లను కూడా సంప్రదించారట.చివరిగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ని ఫిక్స్ చేసినట్లు ఈ సమాచారం తెలుస్తోంది. కథా రీత్యా సుదీప్ ఈ సినిమాకి బాగా సెట్ అవుతాడట. ఇక సుదీప్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. ఆయన నటించిన విక్రాంత్ రొణ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది. అయితే ఇప్పుడు సుదీప్ రాక్షసుడు 2 సినిమాలో నటిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో  తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. హారర్ థ్రిల్లర్  సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా నటించనుందని టాక్. ఇంకా అలాగే విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారని గుసగుసలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.అదే నిజమైతే ఈ సినిమా రికార్డులు నమోదు చెయ్యటం గ్యారెంటీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: