రూ.100 కోట్ల క్లబ్లో చేరిన నిఖిల్ సిద్ధార్థ్..!!

Divya
ఈమధ్య కాలంలో తెలుగులో తెరకెక్కిన చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరుతూ తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి అని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన సూపర్ నాచురల్ మిస్టిక్ త్రిల్లర్ మూవీ కార్తికేయ 2. ఇక ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు.  ఇక ఆర్ట్స్ పీపుల్ మీడియా బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ సినిమాను నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ తన నటనను చాలా చక్కగా కనబరిచిందని చెప్పవచ్చు. ఈ సినిమా రెండు దఫాలుగా విడుదల వాయిదా వేస్తూ వచ్చినప్పటికీ ఎట్టకేలకు ఆగస్టు 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఒక సంచలనం సృష్టిస్తోంది.
ముఖ్యంగా శ్రీకృష్ణుడి తత్వం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అటు బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అతి తక్కువ రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి అతి కొద్ది మంది దర్శకులలో ఈ ఫీట్ ను  అందుకున్నారు దర్శకుడు చందు మొండేటి. ఇకపోతే చిత్రం రూ.  100 కోట్ల దిశగా పయనిస్తోంది అని.. ఇప్పటికే నాన్ థియేట్రికల్ పరంగా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండు వసూళ్లను బట్టి చూస్తే ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. దీంతో అటు దర్శకుడికి,  ఇటు హీరో నిఖిల్ కి మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఈ సినిమా నిఖిల్ సినీ కెరియర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.
రానున్న రోజుల్లో ఈ ఫిగర్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  ఇక బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలకపాత్రలో నటించడం,  శ్రీకృష్ణుడిపై తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: