స్టార్ హీరోల పాత సినిమాలను కొత్తగా విడుదల చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఇప్పటికి టెక్నాలజీకి అనుగుణంగా 4కే రిజల్యూషన్ ఇంకా డాల్బీ ఆటమ్స్ సౌండ్తో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే పోకిరి చిత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 4కే రిజల్యూషన్తో రిలీజ్ చేసిన సినిమా మరోసారి అభిమానులను ఒక రేంజ్ లో ఉర్రూతలూగించింది.ఆగస్ట్ 9 వ తేదీన రీ-రిలీజ్ అయిన పోకిరి సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ సినిమా ఏకంగా రూ. 1.73 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేశాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2వ తేదీన జల్సా చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికి సరిగ్గా 14 ఏళ్లు పూర్తయింది. ఇంకా ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేయనున్నారు.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఇప్పటికే కొత్త ప్రింట్ పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు ఇంకా రచయిత సాయి రాజేశ్ కొత్త ప్రింట్ను చూసినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. 'కొత్త ప్రింట్లో బాబు చాలా కొత్తగా కొన్న అద్దంలా మెరిసిపోతున్నాడు. సౌండ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. మీ సెలబ్రేషన్స్ ని మొదలు పెట్టండి' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 14 ఏళ్ల క్రితం థియేటర్లలో సినిమా చూసిన వాళ్లు, అప్పుడు థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారు మరోసారి జల్సా సినిమా చూడానికి సిద్ధమవుతున్నారు.