'విరాటపర్వం' మూవీ కి భారీ 'ఓటిటి' ఆఫర్లు వచ్చాయి... వేణు ఉడుగుల..!

Pulgam Srinivas
దగ్గుబాటి రానా తాజాగా విరాట పర్వం మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా , ఒక కీలకమైన పాత్రలో ఈ మూవీ లో ప్రియమణి కూడా కనిపించబోతుంది. ఈ మూవీ కి వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, అనేక కారణాల వల్ల అనేక సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడి చివరికి ఈ జూన్ 17 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ మూవీ దర్శకుడు వేణు అడుగుల తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు. దర్శకుడు వేణు ఉడుగుల తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  విరాట పర్వం మూవీ విడుదల లెట్ అవుతున్న కొద్దీ మానసికంగా చాలా బాధ పడేవాడిని కానీ,  చివరగా ఈ మూవీ ని  థియేటర్ విడుదలకు  తీసుకొస్తున్నందుకు నా నిర్మాత లకి థాంక్స్ చెప్తున్నానని వేణు ఉడుగుల చెప్పుకొచ్చారు.

అలాగే వారు విరాట పర్వం మూవీ కి పలు భారీ 'ఓ టి టి' ఆఫర్స్ వచ్చినా కూడా వారిని వదులు కొని థియేటర్ లలోనే ఈ మూవీ ని రిలీజ్ కి తీసుకొస్తున్నారని ఈ ఒక్క విషయంలో తన ఎమోషన్ ను దర్శకుడు వేణు ఉడుగుల బయట పెట్టాడు .  ఇలా తాజా ఇంటర్వ్యూలో వేణు ఉడుగుల అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ ను గమనించినట్లయితే నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: