ప్చ్ పాపం : ఆ ఇద్దరు స్టార్స్ ని నమ్ముకున్న పూజా .... ??

GVK Writings
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కథానాయికగా మంచి అవకాశాలతో కొనసాగుతున్న వారిలో యువ నటి పూజా హెగ్డే కూడా ఒకరు. తొలిసారిగా నవయువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం మూవీ ద్వారా టాలీవుడ్ తెరంగేట్రం చేసిన పూజా, ఆ తరువాత తన అందం, అభినయంతో మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్నారు.
అయితే తన కెరీర్ బిగినింగ్ లో మొదట అక్కడక్కడా కొంత పరాజయాలు చవిచూసిన పూజా హెగ్డే, ఎన్టీఆర్ హీరోగా చేసిన అరవింద సమేత మూవీ ద్వారా తొలిసారిగా భారీ సక్సెస్ సొంతం చేసుకున్నారు. అనంతరం మహేష్ తో మహర్షి, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో వంటి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన పూజా ఇటీవల కాలంలో మళ్ళి కెరీర్ పరంగా ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొన్నాళ్ల క్రితం ప్రభాస్ తో ఆమె చేసిన భారీ పాణి ఇండియా మూవీ రాధేశ్యామ్, కోలీవుడ్ స్టార్ యాక్ట్రర్ విజయ్ తో కలిసి నటించిన బెస్ట్, అలానే చరణ్, చిరంజీవి కలిసి చేసిన ఆచార్య వంటి సినిమాలతో వరుసగా పరాజయాలు అందుకున్నారు పూజా. ఇక ప్రస్తుతం ఆమె మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న భారీ ప్రాజక్ట్ లో హీరోయిన్ గా చేస్తున్నారు. అలానే త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తీయనున్న భారీ మూవీలో కూడా ఆమె హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.

మొత్తంగా ఈ రెండు సినిమాలపైన, అలానే ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పైనే పూజా కెరీర్ పరంగా అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు ఆమెకు ఎంత మేర సక్సెస్ ని అందిస్తారో చూడాలి. ఆయా హీరోల ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్న ఆ రెండు సినిమాలు సక్సెస్ అయితే కెరీర్ పరంగా పూజా మంచి విజయాలు ఆడుకున్నట్లే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: