అదే జరిగితే ఉద్యోగం చేస్తానంటున్న హీరోయిన్..!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నివేద పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడు లో జన్మించిన దుబాయిలో పెరిగి ఆ తర్వాత మోడల్ గా ఎదిగే తన కెరీర్ను ప్రారంభించింది. ఒరునా కుత్తు అనే చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత మెంటల్ మదిలో చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుత యువహీరోయిన్ లతో పోటీపడి నటిస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల వైకుంఠపురం చిత్రం తో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నది.
కానీ నటి గా మాత్రం మంచి మార్కులు సంపాదించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన వృత్తి పరమైన విషయాలను తెలియజేసింది. తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలను కూడా పంచుకుంది. నివేద మాట్లాడుతూ హీరోయిన్ అవ్వడం కాదు నటి గా అనిపించుకోవడం చాలా గర్వకారణంగా ఉందని తెలియజేసింది. హీరోయిన్ గా సినిమాలు చేయకపోతే తన కెరీర్ వేరేలా ఉండేదని చాలా మంది భయపడుతూ ఉంటారు అని తెలియజేసింది.
కానీ తనకు మాత్రం ఎలాంటి భయం లేదని నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రనైనా చేస్తాను.. ఒకవేళ ఆఫర్లు రాకపోతే ఉద్యోగం చేసుకుంటాను అని తెలియజేసింది. అలాగే నటన పరంగా తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి నటన అంటే తనకు చాలా ఇష్టం అని తెలియజేసింది. నివేదా పేతురాజ్ కు ఎక్కువగా జర్నీ లు చేయడం అంటే చాలా ఇష్టమని.. తను ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కచ్చితంగా ఒక కప్పు కాఫీ తాగితే రిలాక్స్ అయిపోతాను అని నివేద పేతురాజ్ తెలియజేసింది. చివరిగా ఈమె లేడీ మేరీ అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాగా అది బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: