మహేష్ సినిమా చూడడానికి ఎంత సాహసం చేసిందో సాయి పల్లవి..?

Divya
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా సెలబ్రెటీలకు స్వేచ్ఛ అనేది ఉండకుండా ఉంటోంది. సిటీ లో తమ అభిమానులకు కనిపించకుండా తమ ముఖాన్ని చూపించకుండా వెళ్ళినా కూడా అప్పుడప్పుడు కొన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని మల్టీప్లెక్స్ మాల్స్ లో కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ చాలా రిస్క్ తీసుకుని మరీ వెళ్తూ ఉంటారు. అందుచేతనే నటీనటులు ఎక్కువగా విదేశాలకు వెళ్లి అక్కడ తమ తమకు నచ్చినన్ని ని రోజులు ఉండి తిరిగి వస్తూ ఉంటారు. ఇక వీరు ఎక్కడికి వెళ్లాలన్న ముందుగా ప్లానింగ్ తోనే బయటకు వెళుతూ ఉంటారు.

 అయితే ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటుంది సాయి పల్లవి. హైదరాబాదులో మల్టీప్లెక్స్లో సర్కార్ వారి పాట సినిమాను చూచి ఇలా ఏమీ తెలియని అమాయకురాలుగా తన కారు ఎక్కి వెళ్ళిపోయింది ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ గా మారుతోంది. హైదరాబాదులో ఉండే pvk ఆర్ కె సినీ ప్లెక్స్ లో సినిమా చూచి వచ్చిన దొంగల తప్పించుకుంటుంది సాయి పల్లవి. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాన్ని స్కార్ప్ తో కప్పేసింది. కరోనా మాస్కు ధరించి చేతిలో హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని.. క్యాజువల్ డ్రెస్లో కనిపించింది. అటు ఇటు ఎవరు గమనించకుండా సైలెంట్ గా కారు ఎక్కి వెళ్ళిపోయింది సాయిపల్లవి.
మరి థియేటర్ లో ఎలా సినిమా చూసిందో తెలియదుగానీ.. థియేటర్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా వచ్చింది. అయితే ఎవరు గుర్తు పట్టకుండా వెళ్లడం, రావడం సాయి పల్లవి ఇది కొత్తేమీ కాదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ఇలాగే వచ్చి చాలా హ్యాపీగా ఉందని తెలియజేసింది. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు సినిమాలు చూసి వచ్చాను అని చెప్పి ఒక పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది. సాయి పల్లవి  నటించిన విరాట పర్వం సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: