మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా లైన్ లో పెడుతూ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా షూటింగ్ పనులను దాదాపుగా పూర్తి చేశాడు, ఈ సినిమా ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ , బోలా శంకర్ , కె ఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.
వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నాడు, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో గాడ్ ఫాదర్ , భోళా శంకర్ సినిమాలు రెండూ కూడా రీమేక్ లే. గాడ్ ఫాదర్ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది ,అలాగే భోళా శంకర్ మూవీ తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రెండు రీమేక్ సినిమాలలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ సినిమాపై కన్నువేసిన ల్ట్లు వార్తలు వస్తున్నాయి, పృధ్విరాజ్ సుకుమారన్ డైరక్షన్ లో తెరకెక్కిన బ్రో డాడీ మూవీ రీమేక్ పై మెగాస్టార్ చిరంజీవి నటించే ఛాన్సులు ఉన్నాయని టాక్. మోహన్ లాల్, పృధ్వి రాజ్ కలిసి నటించిన ఈ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ ఇప్పటికే బడా నిర్మాణ సంస్థ కొనేసినట్టు తెలుస్తుంది, ఈ మూవీ ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారని వార్తలు వస్తున్నాయి.