డోలీలో శబరిమల అయ్యప్ప సన్నిధికి చేరుకున్న మెగాస్టార్ దంపతులు..!!

Divya
మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ ఇద్దరూ జంటగా ఆదివారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరిగింది.. అయితే చాలా సంవత్సరాల తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న  చిరంజీవి శబరిమల యాత్రకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.. అంతే కాదు అక్కడ వీరు తీసుకున్న ఫోటోలు షేర్ చేయడంతోపాటు కింద చాలా కాలం తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరిగింది.. అయితే భక్తుల రద్దీ.. అభిమానుల తాకిడి కారణంగా కాలి నడకన కాకుండా డోలీలో  స్వామి సన్నిధికి చేరుకున్నాము.
స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమను దార పోస్తున్న డోలి సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు .. ఇక ఈ ప్రయాణంలో చుక్కపల్లి సురేష్ అలాగే గోపి కుటుంబాల తోడు మంచి అనుభూతిని పంచింది అంటూ ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ తెలిపాడు.. డోలీ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు చిరంజీవి. ఇక మాస పూజ సందర్భంగా శనివారం సాయంత్రం అయ్యప్ప స్వామి దేవస్థానం తలుపులు తెరిచిన విషయం అందరికి తెలిసిందే..అయితే భక్తుల దర్శనార్థం ఈనెల 17వ తేదీ వరకు దేవాలయం తెరిచే ఉంచుతారు. కాబట్టి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లు 17వ తేదీలోపు దర్శించుకోవచ్చు అని అధికారులు వెల్లడించారు.

ఇకపై చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి అయ్యప్ప దీక్ష తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక అలా ఆయన తో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటూ ఉంటారు.. ఇకపోతే మండల పూజ , మకరజ్యోతి సమయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పుడు కుదరకపోవడంతో ని ఇప్పుడు ఇలా చిరంజీవి దంపతులు శబరిమల యాత్రకు వెళ్ళడం జరిగింది.. ఇదిలా ఉండగా డోలీలో శబరి కొండకు చేరుస్తున్న డోలీ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు మెగాస్టార్.. అంతేకాదు వారితో కాసేపు ముచ్చటించారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: