ప‌వ‌న్ సినిమాలో హీరోయిన్ మారిపోయిందోచ్‌..!

VUYYURU SUBHASH
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దగ్గుబాటి రానా తో కలిసి భీమ్లా నాయ‌క్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలోకి రానుంది. అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ముందు చెప్పిన డేట్ లో భీమ్లా నాయ‌క్ రిలీజ్ చేస్తారా లేదా మార్చికి వాయిదా వేస్తారా అన్నది కూడా సందేహం గానే ఉంది. ఇక పవన్... క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పక్కన బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. జాక్విలిన్ ఈ సినిమాలో ఔరంగజేబు చెల్లెలి పాత్రలో రాజకుమారిగా కనిపించ‌బోతోంద‌ని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరో బాలీవుడ్ హీరోయిన్ న‌ర్గీస్ ఫ‌క్రీని జాక్వెలిన్ స్థానంలో హీరోయిన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
జాక్వెలిన్ సోకేష్ చంద్రశేఖర్ నుంచి కోట్ల రూపాయల బహుమతులు అందుకున్న నేపథ్యంలో ఆమెను ప్రస్తుతం ఈడీ అధికారులు విచారిస్తున్నారు. రెండు వందల కోట్ల రూపాయల వ్యవహారంలో ఆమె పేరు ముడిపడి ఉన్నందున... ఈ కేసు వల్ల ఆమె ఈ సినిమాను మిస్ చేసుకున్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు క్రిష్ మాత్రం.. తాము ముందే నర్గీస్ ఫక్రీను హీరోయిన్ గా తీసుకున్నామని చెబుతున్నారు.
జాక్వెలిన్‌ బాలీవుడ్ సినిమాలలో బిజీగా ఉండడం తోనే తమ సినిమాకు కాల్షీట్లు సర్దుబాటు చేయలేక పోయిందని చెబుతున్నారు. భీమ్లా నాయక్ సినిమా పూర్తయిన వెంటనే పవన్ హరి హర వీరమల్లు సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తారు. సెకండాఫ్ లో నర్గిస్ ఫక్రీ పాత్ర ఉంటుంది. మధ్యలో అనసూయ కూడా ఐటెం సాంగ్ లో మెరవనుందని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: