RC 15 లో 'ఐ' విలన్!

Veldandi Saikiran
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ శంకర్ ల పాన్ ఇండియా సినిమా చిత్రీకరణ ఈ నెల చివరన పూణే నగరంలో ప్రారంభం కానుంది.  రామ్ చరణ్ ఇప్పటికే పూణే చేరుకొన్నాడు. ఈ చిత్రం మొదటి షెడ్యూలులో  డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ పైన మరియు ఇతర తారాగణం పైన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. కైరా అద్వానీ కొంచెం ఆలస్యంగానే చిత్రీకరణ లో పాలుపంచుకుంటుంది.  ఇది వరకు తాను ఇచ్చిన ఇంటర్వ్యూ లోని సారాంశం బట్టి కైరా ఆర్ సి 15 షూటింగ్ ని పాట తో మొదలు పెట్టనుంది .   ఈ చిత్ర ప్రారంభోత్సవం నాడు దాదాపు కీలక నటులు అందరి పేర్లను బయలు పెట్టారు ఒక్క విల్లన్ పాత్రధారి తప్ప.

 ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి 'ఐ' చిత్రం తో మెప్పించిన మలయాళ సీనియర్ నటుడు సురేష్ గోపి ఆర్ సి 15 లో మరోసారి తన విలనిజాన్ని చూపించనున్నారని భోగట్టా! ఇదే నిజమైతే 'ఐ' తరువాత సురేష్ గోపి కి ఇది రెండవ చిత్రం డైరెక్టర్ శంకర్ తో. ఇందులో రామ్ చరణ్ కలెక్టర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్ మరియు జయరాం కీలక పాత్రలో నటించనున్నారు.  ఈ చిత్రానికి సంగీతం థమన్, నిర్మాత  దిల్ రాజు. కాగా ప్రస్తుతం  మెగా పవర్ స్టార్ రాం చరణ్...  త్రిపుల్ ఆర్ మూవీ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి మనందరికీ విధితమే.

ఈ త్రిబుల్ ఆర్ సినిమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పాత్రను చేస్తున్నారు.  టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమా చేయగా... ఇప్పుడు మరోసారి త్రిబుల్ ఆర్ సినిమా తో అందరినీ కనువిందు చేయనున్నాడు రామ్ చరణ్. దీంతో అందరిలోనూ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. త్రిబుల్ ఆర్ సినిమా ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: