'ప్రభాస్ 25' డిసెంబర్ లో అదిరిపోయే అప్డేట్..?

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 'జిల్' పెమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 'రాదే శ్యామ్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించింది.  ఈ సినిమాతో పాటు 'కేజిఎఫ్' సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్' సినిమా లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్' అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. దీనితో పాటే ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వం లో కూడా ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఇలా నాలుగు పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ తన ప్రతిష్ఠాత్మకమైన 25వ సినిమాకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే పోతున్నట్లు ఎప్పటినుండో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు బృందావన అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమా షూటింగ్ మాత్రం డిసెంబర్ లో మొదలవుతుంది అంటూ ఒక వార్త ఫిల్మీ దునియా లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: