మహేష్ ప్రక్కన మరోసారి ఆమెనే సెట్ చేస్తున్న అనిల్ .... ??

GVK Writings
మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ 27వ సినిమా సర్కారు వారి పాట చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో భారీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ తో కలిసి ఫస్ట్ టైం కీర్తి సురేష్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా మది ఛాయాగ్రాహకుడిగా అలానే ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయనుంది యూనిట్. మహేష్ ఈ సినిమాలో ఒక విభిన్న పాత్ర పోషిస్తుండగా బ్యాంకింగ్ రంగంలో జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నేపథ్యంలో ఈ మూవీ ని దర్శకుడు పరశురామ్ తీస్తున్నట్లు సమాచారం.
ఇక దీని అనంతరం హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ తెరకెక్కించనున్న భారీ మూవీలో నటించనున్నారు మహేష్ బాబు. ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాకి కూడా థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అయితే ఈ మూవీ తరువాత అనిల్ రావిపూడి తో సూపర్ స్టార్ పని చేయనున్నారు అనే వార్త కొద్దిరోజుల నుండి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి నెక్స్ట్ మూవీ రాజమౌళితో చేయాలని భావించిన మహేష్, ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉండడంతో, అది పూర్తి అయి ఆయన ఫ్రీ అవడానికి చాలా సమయం పడుతుందని భావించి త్రివిక్రమ్ మూవీ తో పాటు అనిల్ మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
గతంలో మహేష్ తో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ తీసిన అనిల్ ఈ తాజా సినిమాలో ఆయన పాత్రని మరింత అద్భుతంగా రాసుకున్నారని, మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని ఎంపిక చేసినట్లు లేటెస్ట్ టాక్. సరిలేరు లో కూడా మహేష్ కి జోడీగా రష్మిక యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మరొక్కసారి సూపర్ స్టార్ తో నటించే ఛాన్స్ ని రష్మిక పట్టేసినట్లే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: