భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా బిగ్ బాస్ మొదలయ్యాక టీఆర్పీ రేటింగ్ ఒక స్థాయిలోకి వెళ్తుంది. బిగ్బాస్ షో.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మళయాళ వంటి భాషాల్లో చాలా పేమస్ అయింది. ఈ ప్రోగ్రాం తెలుగులో ఐదో సీజన్ ఇంకో రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫస్ట్ ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. తరువాత నాని, అనంతరం కింగ్ నాగార్జునలు చేశారు. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఐదో సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు.
సీజన్ ఐదు గురించి ఎన్నో రోజుల నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ షో విషయాల గురించి రోజుకో వార్త పరిశ్రమలో షికార్లు కొడుతుంది. నేడు ఓ వార్త హాల్ చల్ చేస్తున్నది. అదేంటంటే బిగ్ బాస్లోకి ఇప్పటికే 16 మంది పేర్లను ఖాయం చేసినట్లుగా విని వస్తుంది. అందులో సిరి హనుమంత్, కార్తీకదీపం సీరియల్ నటి ఉమాదేవి, అనీ మాస్టర్, సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ, ప్రియాంక సింగ్, లోబో, నటరాజ్ మాస్టర్, శ్వేతా వర్మ, షణ్ముఖ్ జశ్వంత్, యాంకర్ రవి, ఉమాదేవి, మానాస్, వి.జె.సన్నీ, ఆర్జే కాజల్, శ్రీరామ్, లహరి, సరయు ఇంట్లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే వీరందరూ క్వారంటైన్లో ఉన్నారు. ఆదివారం నాడు బిగ్బాస్ హౌజ్లోకి వెళ్తున్నారు.
ఒకేసారి అందరూ వెళ్తున్నట్లు సమాచారం. యాంకర్ రవి, అనీ మాస్టర్, ఉమాదేవి, షణ్ముఖ్ జశ్వంత్, ఆర్టిస్ట్ ప్రియ ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. వీరంతా ఒక వారానికి 40 వేల రూపాయలు తీసుకుంటున్నారని గుసగుసలు. ఇప్ప వరకైతే బిగ్బాస్ యాజమాన్యం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ ఫిలీంనగర్లో వీరి పారితోషకం గురించి గుసగుసలు మొదలయ్యాయి. ఎవరికెంత ఇస్తున్నారనే సమాచారం బిగ్ బాస్నుంచి ఎటువంటి లీకేజీలు లేవు. చూడాలి మరి బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభమయ్యాకనైనా అసలు విషయం తెలుస్తుందో లేదోనని.