ప్చ్.. బ్యాడ్ లక్..!
మిస్ ఇండియా కాంపిటీషన్ నుంచి డైరెక్ట్ గా టాలీవుడ్లో అడుగుపెట్టింది హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి. సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో టీటౌన్కి వచ్చిన మీనాక్షికి ఆ వెంటనే రవితేజ 'ఖిలాడి', అడివి శేష్ 'హిట్2'లో అవకాశాలు వచ్చాయి. అయితే ఈ మూడిటిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. సమ్మర్లోనే రావాల్సిన 'ఖిలాడి'కి సెకండ్ వేవ్తో బ్రేకులు పడ్డాయి. ఇక 'హిట్2' షూటింగ్ స్టార్ట్ చెయ్యాల్సి ఉంది.
సల్మాన్ ఖాన్ 'దబాంగ్3'తో కెరీర్ మొదలుపెట్టిన సయీ మంజ్రేకర్, తెలుగులోనూ రెండు సినిమాలకి సైన్ చేసింది. అడివి శేష్ 'మేజర్'లో నటిస్తోంది. ఈ మూవీ జులై ఫస్ట్ వీక్లోనే రిలీజ్ కావాల్సింది. అయితే సెకండ్ వేవ్తో బ్రేకులు పడ్డాయి. అలాగే వరుణ్తేజ్తో కలిసి నటిస్తోన్న 'గని' సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది.
హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పెరుగుతోన్న వయసుతో కెరీర్ తరిగిపోతుంటుంది. అందుకే తక్కువ టైమ్లో ఎక్కువ సినిమాలు చెయ్యాలని ట్రై చేస్తుంటారు హీరోయిన్లు. అయితే కరోనా వేవ్స్తో హీరోయిన్ల ఆశలకి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా వస్తోన్న హీరోయిన్ల కెరీర్ స్పాన్ని దెబ్బతీస్తోంది.
కోలీవుడ్లో తక్కువ టైమ్లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ తాన్యా రవిచంద్రన్. ఈమె కార్తికేయ 'రాజా విక్రమార్క' సినిమాతో తెలుగుకి వస్తోంది. అయితే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యాక లాక్డౌన్ వచ్చింది. తాన్యాకి బ్రేకులు పడ్డాయి. అలాగే 'ఓ మై కడవులే' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెడుతోన్న ముంబయి బ్యూటీ మిథిలా పార్కర్ పరుగులకి లాక్డౌన్తోబ్రేకులు పడ్డాయి. చూద్దాం వీళ్ల కెరీర్ ముందుముందు ఎలా సాగుతుందో.