వెంకీ సినిమాకి ఓటీటీ భారీ ఆఫర్..? ఏ సినిమా కంటే..!

yekalavya
కరోనా దెబ్బకు సినిమా రంగం స్తంభించింది. షూటింగ్‌లన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పటికే పూర్తయిన సినిమాలు విడుదల లేక మూలనపడ్డాయి. దీంతో చిన్ని సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. కానీ పెద్ద హీరోలు మాత్రం సినిమాలు రిలీజ్ చేయకుండా ఆగుతున్నారు. అయితే టాలీవుడ్‌లో ప్రతి విషయంలోనూ ముందుండే విక్టరీ వెంకటేష్.. ఓటీటీలో కూడా తాను ముందుగా అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం వెంకీ చేతిలో వరుసగా మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి మళయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2, రెండోది తమిళంలో ధనుష్ చేసిన అసురన్ రీమేక్ నారప్ప, మూడోది ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3. ఇందులో నారప్ప, దృశ్యం 2 షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ఎఫ్ 3 షూటింగ్‌ సగానికి పైగా పూర్తయింది.
నిజానికి ఇందులో నారప్ప సినిమా ముందుగా పూర్తయింది. థియేటర్లలో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా దెబ్బకు ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక దృశ్యం సీక్వెల్ ప్రారంభించిన 2 - 3 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎఫ్ 3 కూడా దాదాపు షూటింగ్ పూర్తయింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా బారిన పడకుండా ఉండి ఉంటే ఈ సినిమా షూటింగ్ కూడా ఈ పాటికి పూర్తయి ఉండేది.

ప్రస్తుతం వెంకీ చేసిన దృశ్యం 2 సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చిందట. దీంతో దృశ్యం మేకర్స్‌తో పాటు వెంకటేష్ కూడా ఆ వైపుగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దృశ్యం-2 మూవీ ఓటీటీలో రిలీజ్ చేస్తే అటెన్షన్ కాపాడుకున్నట్లు ఉంటుందని వెంకీ అండ్ టీం భావిస్తోందట. దీని ప్రకారం.. దృశ్యం 2ను ఓటీటీలో రిలీజ్ చేసి.. థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత నారప్పను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఎఫ్-3 ఇంకా కంప్లీట్ కానందున దాని గురించి ఇప్పట్లో ఆలోచించాల్సిన పనిలేదని అనుకుంటున్నారట.

కాగా.. మళయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే రిలీజ్ అయింది. మంచి విజయం కూడా దక్కించుకుంది.
అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎలాంటి న్యూస్ రాలేదు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: