బాక్సాఫీసు వద్ద ఘర్జించని మృగరాజు
హాలీవుడ్ చిత్రం ది గోస్ట్ ఇన్ ది డార్క్నెస్ ఆధారంగా, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని జోడించిన మసాలాలతో రూపొందిన మృగరాజు చిత్రం డిజాస్టర్గా మిగలడానికి దర్శకుడి అనుభవ రాహిత్యమే ప్రధానమని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే గొప్ప అవకాశాన్ని దక్కించుకున్న గుణశేఖర్ చిరంజీవి నటనను ఉపయోగించుకునేలా, ఆయన ఇమేజ్కు తగినవిధంగా సన్నివేశాలు రూపొందించడంలో విఫలమయ్యాడు. చిరంజీవి ఈ చిత్రంలో ఓ గిరిజన యువకుడిగా కనిపిస్తాడు. దట్టమైన అడవుల్లో ఓ రైలు బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నవారిపై ఓ సింహం దాడి చేస్తుంటుంది. ఈ ప్రాజెక్టు సైట్ ఇంజనీర్గా కథానాయిక సిమ్రాన్ వస్తుంది. వీరికి సాయం చేసేందుకు వేటలో నైపుణ్యమున్న గిరిజన యువకుడైన హీరో వస్తాడు. అక్కడినుంచి పలు మలుపులతో చిత్రం సాగుతుంది. దక్షిణాఫ్రికా అడవుల్లో సింహంతో మెగాస్టార్ చిరంజీవి చేసే పోరాటాలు, గ్రాఫిక్స్ తప్ప.. సినిమా కథ, కథనంలో పట్టు, ఆకట్టుకునే స్క్రీన్ప్లే లేకపోవడం ఈ చిత్రంలో ప్రధాన లోపం. దీంతో చిరంజీవి వీరాభిమానులను సైతం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో దీనికి పోటీగా విడుదలైన బాలకృష్ణ నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచే స్థాయి విజయం సాధించడంతో మృగరాజు ఆ చిత్రం ముందు తేలిపోయింది.