ఒకే రోజున మెగాస్టార్ - బాలయ్య సినిమాలు రిలీజ్ .... ఇక కురుక్షేత్రమేనా ....??
ఇటీవల 50 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి సహా సినిమాలోని పలువురు కీలక నటులపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది మూవీ యూనిట్. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానుంది. మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ ప్రతిష్టాత్మక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత తరంగం తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది.
మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే అటు మెగాస్టార్ ఆచార్య ఇటు బాలయ్య బోయపాటి సినిమాలు రెండూ కూడా వేసవి సమయంలో ఒకే రోజున రిలీజ్ కానున్నట్లు టాక్. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి అంజి అలానే బాలయ్య లక్ష్మీనరసింహా సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ అయ్యాయి. అలానే అంతకుముందు నరసింహనాయుడు, మృగరాజు సినిమాలు కూడా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అటు నందమూరి ఇటు మెగా హీరోల సినిమాలు రెండూ కూడా ఒకే రోజు రిలీజ్ కావడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం ఈ ఇద్దరు బడా స్టార్ల బాక్సాఫీస్ కురుక్షేత్రం మొదలైనట్లే అంటున్నారు విశ్లేషకులు....!!