ఆ దర్శకుడుకి నో చెప్పినందుకు బెదిరించారు..!
చిత్ర పరిశ్రమ ఒక్క మాయాజాలం లాంటిది. ఈ పరిశ్రమలో తెరపై సినిమా అద్భుతంగా ఉన్నా తెర వెనుక కొన్ని అంశాలు చేదుగా ఉంటాయి. ఇఇ చిత్ర పరిశ్రమలో అమ్మాయి హీరోయిన్ గా నిలవడానికి చాల వడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి, కాస్టింగ్ కౌచ్, బెదిరింపులు ఉంటాయి. అయితే చిత్ర పరిశ్రమలో ముక్కు సూటిగా మాట్లాడే నటి కంగనా రనౌత్. తాజాగా ఆమె తనకు ఎదురైనా ఒక్క సంఘటన గురించి వెల్లడించారు.
అయితే సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’కు నో చెప్పినందుకు ఆ సినిమా నిర్మాత, యశ్ రాజ్ ఫిల్మ్స్ హెడ్ ఆదిత్య చోప్రా తనను బెదిరించాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కంగన బయటపెట్టింది. ఆ సినిమా దర్శకుడు కంగనా ఇంటికి వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పారని తెలియజేశారు. ఆ తర్వాత ఆదిత్య చోప్రాను కలిసి నేను ఈ సినిమాలో నటించలేనని చెప్పారని తెలిపారు. అప్పుడు ఆయన బాగానే ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ‘కంగనా.. సుల్తాన్ సినిమాకి నో చెప్పిందంటూ కొన్ని వార్తలు వచ్చాయని సమాచారం.
అయితే 2016 లో విడుదలైన ‘సుల్తాన్’ సినిమాలో సల్మాన్ కు జోడీగా అనుష్క శర్మ నటించింది. అయితే మొదట హీరోయిన్ పాత్ర కోసం చిత్ర బృందం దీపికా పదుకొణెను సంప్రదించారు. ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో ఆ ఆఫర్ కంగనా రనౌత్ వద్దకు వచ్చింది. కానీ ఆమె నో చెప్పింది. దీంతో అనుష్క శర్మను హీరోయిన్ గా తీసుకున్నారు. కంగనా రనౌత్ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు. ఆ సమయంలో ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రంతో కంగన హిట్ కొట్టారు. తదుపరి చిత్రంలో సల్మాన్ కు జోడిగా మాత్రమే నటించి తన ప్రాధాన్యతను తగ్గించుకోవడం ఇష్టం లేక ఆ సినిమాలో నటించలేదని పేర్కొన్నారు.