శింబు మ్యారేజ్ పై తండ్రి రాజేంద్రర్ ఏం చెప్పారంటే...?

Kothuru Ram Kumar

తమిళ నటుడు శింబు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ తనదైన పాత్రలతో మెప్పించారు. ఇరు రాష్ట్రాలలో తన నటనలతో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే శింబు పై సోషల్ మీడియా లో అనేక వార్తలు వస్తుండేవి. అలాంటి వార్తలకు చెక్ పెడుతూ శింబు పెళ్లి చేసుకోబోతున్నా శుభవార్తను అభిమానులకు తెలిపారు.

 

నయనతారతో శింబు పెళ్లి వార్తలపై ఆయన తండ్రి రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. శింబు పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటిని నమ్మవద్దంటూ అభిమానులను కోరారు. ఇప్పటివరకు శింబు పెళ్లిపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని, శింబుకు సరిపోయే సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. జాతకాలు కలిసే అమ్మాయి దొరికితే.. మేమే అందరికీ తెలియజేస్తామని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకుండా వేచి చూడాలంటూ ఓ పత్రికా ప్రకటనను సైతం విడుదల చేశారు. 

 

అప్ప‌ట్లో న‌య‌న‌తార‌తో ప్రేమాయ‌ణం న‌డిపి వార్త‌ల‌లో నిలిచిన శింబు కొద్ది రోజుల త‌ర్వాత హ‌న్సిక ప్రేమ‌లో మునిగి తేలాడు. ఆమెకి బ్రేక‌ప్ చెప్పిన త‌ర్వాత  త్రిష‌తో ప్రేమాయ‌ణం సాగించాడ‌ని పుకార్లు పుట్టుకొచ్చాయి. క‌ట్ చేస్తే  2019లో శింబు సోదరుడు కురళరసన్‌కు వివాహం జరిగినప్పుడు  శింబు పెళ్లిపై వార్త‌లు గుప్పుమ‌న్నాయి. రీసెంట్‌గా  వంట చేస్తూ.. కాబోయే భార్య‌ని క‌ష్ట‌పెట్ట‌నంటూ వీడియో రిలీజ్ చేశారు శింబు. ఈ నేప‌థ్యంలో లండ‌న్‌కి చెందిన అమ్మాయితో  పెళ్లి పీట‌లెక్క‌నున్నాడ‌నే వార్త దావానంలా పాకింది.

 

శింబు మ్యారేజ్ పై గతంలో కూడా అనేక వార్తలు వచ్చాయి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ నయన తారతో ప్రేమలో పడ్డాడని, ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే వదంతలు వ్యాపించాయి. పెళ్లి చేసుకుంటారని అనుకొనే సరికి వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయినట్లు టాక్. లాక్ డౌన్ అనంతరం మాజీ ప్రేయసి నయనతో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్వయంగా శింబు ఫాదర్ రెస్పాండ్ కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: