పనస గింజలను పడేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

lakhmi saranya
పనసగింజలు గురించి మనలో చాలామందికి సరైన అవగాహన లేదు. పనసపండ్లు తిన్న తర్వాత దాంట్లోని గింజలను చాలా మంది పారేసేస్తుంటారు. కానీ ఈ చిన్న గింజల్లో అధ్బుతమైన ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయి. దీన్ని వంటల్లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి ఎన్నో రకాల లాభాలు పొందవచ్చు. పనసగింజలలో ఉండే ముఖ్యమైన పోషకాలు. ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఐరన్, పొటాషియం, జింక్, థియామిన్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు, పనసగింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఇది కండరాల పెరుగుదలకు, శక్తికి ఉపయోగపడుతుంది. వ్యాయామం చేసే వారికి పనసగింజలు శక్తివంతమైన స్నాక్‌గా పనిచేస్తాయి. పనసగింజల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. హేమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

తల తిరుగుడు, అలసట, నలుపుగా కనిపించడం వంటి రక్తహీనత లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న థియామిన, నరాల ఆరోగ్యానికి అవసరం. మెమరీ పవర్ పెరగడంలో సహకరిస్తుంది. అధిక ఒత్తిడి ఉన్నవారు తరచూ తీసుకుంటే మానసిక ఉల్లాసం పొందవచ్చు. పనసగింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. పేగుల కదలిక మెరుగవుతుంది. పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు నియంత్రితంగా ఉంటుంది. హార్ట్‌అటాక్, స్ట్రోక్ వంటి సమస్యల అవకాశాలు తగ్గుతాయి. మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాల వల్ల ఎముకలు బలంగా మారుతాయి. వృద్ధాప్యంలో ఎముకల నలిమి తగ్గించడంలో సహాయపడతాయి. పనసగింజల్లో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది.

 వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో శరీరం బలపడుతుంది. జీర్ణం అయ్యే వేగం తక్కువగా ఉండడం వల్ల ఆకలి త్వరగా రాదు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ కాలరీలతో బరువు తగ్గించుకోవచ్చు. వీటిలో బీటా కెరోటిన్ వంటి పదార్థాలు ఉండటం వల్ల చూపు మెరుగవుతుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి కణాలను క్యాన్సర్‌కి దూరంగా ఉంచుతాయి. గింజలను శుభ్రంగా కడిగి నీటిలో ఉడకబెట్టి కొద్దిగా ఉప్పు కలిపి తినవచ్చు. పనసగింజలను మసాలా కర్రీల్లో, చిక్కుడు కాయ, వంకాయ వంటల్లో చేర్చవచ్చు. ఇవాళ ఫ్యూజన్ వంటకాలలో ‘పనసగింజ పచ్చడి’ చాలా ఆరోగ్యకరమైనదిగా చెబుతారు. ఇవీ శుభ్రంగా ఎండబెట్టి పొడి చేసి సూప్స్, కర్రీల్లో చల్లి తినొచ్చు. ఇది శక్తివంతమైన పోషక పౌడర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: