కీళ్ల నొప్పులని ఈజీగా తరిమికొట్టే టిప్స్?

Purushottham Vinay
ప్రస్తుతం అందరికి కూడా కీళ్ల నొప్పులు సర్వ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు కేవలం పెద్దలకు మాత్రమే వచ్చే ఈ నొప్పులు ఉండేవి. అయితే ఇప్పుడు పిల్లలకు, యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా వస్తున్నాయి.అయితే అందుకు కారణం విటమిన్లు, ఇతర పోషకాల లోపమే అని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే కీళ్ల నొప్పులు వచ్చాయని ఏమాత్రం దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే.. కింద చెప్పిన సహజ సిద్ధమైన పదార్థాలతో జ్యూస్‌ను తయారు చేసుకుని ప్రతి రోజూ తాగితే  కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఈజీగా బయట పడవచ్చు. ఇక ఆ జ్యాస్ ఏమిటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ జ్యూస్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని ఓట్స్ వేసి ఉడికించాలి.ఆ ఓట్స్ ఉడికాక స్టవ్ ని ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఆ తరువాత పైన చెప్పిన దాల్చిన చెక్క, పైనాపిల్‌, ఆరెంజ్ జ్యూస్‌, తేనెలను తగినంత భాగాల్లో తీసుకుని అన్నింటినీ కలపాలి. అయితే ఈ మిశ్రమంలో అవసరం అనుకుంటే కొంత నీరు పోసి ముందు ఉడికిన ఓట్స్‌ను కూడా వేయాలి. ఆ తరువాత దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అందువల్ల జ్యూస్ వస్తుంది. తరువాత ఆ జ్యూస్‌ను తాగేయాలి. ఇలా ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. అందువల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. అయితే మోకాళ్ల నొప్పులకు మందులను వాడే వారు కూడా ఈ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగితే మందులను వాడడాన్ని క్రమంగా ఆపేయవచ్చు.అయితే దీన్ని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే చేయాల్సి ఉంటుంది.ఈ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి.అందువల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా అలాగే దీంట్లో సిలికాన్‌, బ్రొమిలైన్‌, విటమిన్ సి, మెగ్నిషియంలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల నొప్పుల నుంచి ఈజీగా ఉపశమనం కలిగేలా చేస్తాయి. మన శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. కీళ్లు చాలా బలంగా, దృఢంగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: