షుగర్ ని కంట్రోల్ లో ఉంచే జ్యూసులు ఇవే?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి గ్రాస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. భారతదేశంలో ఏకంగా 101 మిలియన్ల మధుమేహ రోగులు ఉన్నారని ICMR తాజా అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని కనుక చూస్తుంటే ఈ సంఖ్యను పెంచే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ వ్యాధి చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతోంది. ఏకంగా 463 మిలియన్ల మంది యువత దీని బారిన పడుతున్నారు. 2040 నాటికి ఈ సంఖ్య మొత్తం 700 మిలియన్లకు చేరుకోవచ్చట. చక్కెర ఆహారాలు మధుమేహానికి ప్రధాన కారణమవుతాయి.మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు పొద్దున్నే ఖాళీ కడుపుతో కొన్ని పానీయాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ఈజీగా నియంత్రించవచ్చు. డయాబెటిక్ రోగులు ఉదయం ఖాళీ కడుపుతో ఏదైనా  డ్రింక్ తీసుకుంటే రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా తగ్గించవచ్చు. అటువంటి పానీయాల గురించి తెలుసుకుందాం.వీటిని తీసుకోవడం వల్ల రోజంతా రక్తంలో చక్కెరను చాలా సులభంగా నియంత్రించవచ్చు.



వేసవి కాలంలో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే మజ్జిగలో కొవ్వు, కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది టైప్-1, టైప్-2 మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ మజ్జిగలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ మజ్జిగలో జీలకర్ర, కొత్తిమీర, అల్లం, మసాలా దినుసులు వేసి కూడా తినవచ్చు.అలాగే కాకరకాయ రసం తాగడానికి చేదుగా ఉంటుంది. కానీ దాని ప్రయోజనాలు అయితే తీపిగా ఉంటాయి. విటమిన్లు ఎ, బి, సి, థయామిన్ ఇంకా రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహాన్ని నియంత్రించడంలో ఈ రసం చాలా సహాయపడుతుంది. అలాగే షుగర్ పేషెంట్లు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొట్లకాయ రసాన్ని తీసుకోవాలి. దీనివల్ల రోజంతా రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: