అతిగా నిద్రపోతే తప్పదు ముప్పు?

Purushottham Vinay
ప్రతి రోజు కూడా ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. అయితే చాలా మంది కూడా 8 గంటలకు పైగా నిద్రపోతూ ఉంటారు. ఇలా అధికంగా నిద్రపోవడం వల్ల మేధోశక్తి తగ్గుతుందని, వృద్ధుల్లో అయితే ఈప్రమాదం ఎక్కవుగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 8 గంటల కంటే ఎక్కువుగా నిద్రపోవడం వల్ల వృద్ధుల్లో డిమెన్షియా (చిత్త వైకల్యం) రిస్క్ 69% పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. త్వరగా నిద్రపోయే వారు లేదా ఎక్కువ సమయం నిద్రపోయేవారు చిత్త వైకల్య సమస్యతో బాధపడతారని తేలింది. చిత్త వైకల్యం అనేది మేథస్సు పనితీరులో గణనీయమైన క్షీణతను కలిగించే వైద్య సంబంధమైన రుగ్మత. ఇది అనేక వ్యాధులలో సంభవించే పలు లక్షణాల కలయిక. ఈ రుగ్మత కారణంగా మేధాశక్తి, ప్రవర్తనా తీరును తగ్గిపోయేలా చేస్తుంది.రాత్రి 9 గంటల ముందు 10 గంటల తర్వాత నిద్రపోయే వారికి చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఎక్కువ సమయం, త్వరగా నిద్రపోతున్న వారిపై ఇటీవల చైనా లోని గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులపై చేసిన అధ్యయనంలో అనేక విషయాలు వెల్లడయ్యాయి.


చిత్తవైకల్యం అభివృద్ధి చెందని వారిలో కూడా ఎక్కువ సమయం నిద్రపోవడం, త్వరగా నిద్రపోవడం కారణంగా అభిజ్ఞా క్షీణత ఇప్పటికీ ఉందని అధ్యయనం కనుగొంది. అయితే ఈలక్షణాలు 60 నుంచి 74 సంవత్సరాల మధ్య వారిలో ఎక్కువుగా కనిపిస్తున్నాయి. అంటే వృద్ధుల్లో ఈప్రభావం ఎక్కువ. వాస్తవానికి గ్రామీణ చైనాలోని వృద్ధులు సాధారణంగా ముందుగా నిద్రపోతారు. పట్టణ, నగరాలకు చెందిన ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత వ్యక్తులు త్వరగా నిద్రపోతారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో డిమోన్షియా ప్రభావం ఎక్కువుగా ఉంటున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.కాబట్టి ఖచ్చితంగా కేవలం 8 గంటలు మాత్రమే నిద్రపోండి. అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోకండి. అలాగే రాత్రి 9 నుంచి 10 గంటల సమయం మధ్యలోనే నిద్రపోండి. ఈ సమయాల్లో ఎలాంటి తేడా రానియ్యకండి. లేదంటే ఖచ్చితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: