షుగర్ తగ్గాలంటే ఖచ్చితంగా ఇది తినండి?

Purushottham Vinay
ఇక డయాబెటీస్‌ అనేది కేవలం ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచానికే చాలా పెద్ద తలనొప్పిగా మారింది. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కూడా అసలు దీనికి సరైన మందుని కనిపెట్టలేకపోయారు.డయాబెటిక్ రోగులు వారి ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో కనుక లేకుంటే అది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఆహారంలో గోధుమపిండికి బదులు రాగిపిండిని కనుక వాడితే షుగర్‌ లెవల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. రాగిపిండి గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా మనం మన రోజువారీ ఆహారంలో గోధుమ పిండిని ఉపయోగిస్తాము. కానీ మధుమేహ రోగులు అయితే తప్పనిసరిగా రాగి పిండిని తీసుకోవాలి. దీంతో కేవలం మధుమేహం మాత్రమే కాదు ఊబకాయం ఇంకా అలాగే అధిక రక్తపోటు (హై బీపీ) అన్ని వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఇంకా భారతదేశంలో అన్ని వయసుల వారు ఇలాంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కాబట్టి రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఈ రాగులను చేర్చుకోవాలి.అలాగే డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేయాలనేది చాలా పెద్ద సమస్య.


ఆహారం తీసుకోవడంలో చిన్న నిర్లక్ష్యం వహించినా కానీ చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో చాలా మంది ఆరోగ్య నిపుణులు కూడా ఈ రాగి పిండిని తినమని సలహా ఇస్తున్నారు.ఎందుకంటే ఈ రాగి పిండిలో అనేక రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. అయితే జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా రాగులు తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. రాగుల్లో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్ డి ఇంకా ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. షుగర్ మెయింటెయిన్ చేయడంతో పాటు ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. అంతేకాదు శరీరంలో రక్తానికి కూడా లోటు ఉండదు. మీరు రాగి పిండితో రోటీ, స్నాక్స్ ఇంకా దోసలను తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: