త‌ల్లికి వంద‌నం : బతుక‌మ్మ పాట‌కు రెహ్మాన్ స్వ‌రాలు

RATNA KISHORE
ఏటా తెలంగాణ వాకిట అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే బ‌తుక‌మ్మ పండుగ‌కు విశేషార్థం చేకూరుస్తూ ప్రముఖ సంగీత కారులు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఈ వార్త విన్న సంగీత అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆ పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టిదాకా జాన‌ప‌దుల గాత్రంలో ఎంతో గొప్పగా విన్న  పాట చాలా కాలానికి ఓ ఆధునిక సంప్ర‌దాయ రీతిలో ఎలా ఉంటుందో అన్న ఆస‌క్తి కూడా నెల‌కొంది.


ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి నుంచి మొద‌ల‌య్యే పండుగ‌కు అంతా సిద్ధం అవుతోంది. పూల పండుగ‌కు ప‌ల్లె, ప‌ట్నం అన్న తేడా లేకుండా సిద్ధం అవుతోంది. తొమ్మిది రోజుల ఆట పాటల పండుగ‌కు కొత్త ఆనందాలు జ‌త కానున్నాయి. బ‌హుజ‌న బ‌తుక‌మ్మ పాట ఒక‌రు రాస్తే, ప‌ల్లె కీర్త‌నల నేప‌థ్యంలో మ‌రొక‌రు ఆ త‌ల్లి గౌరిని కీర్తిస్తే ఈ సారి మాత్రం మ‌రో మంచి వార్త వినేందుకు మీరంతా సిద్ధంగా ఉండండి అంటున్నారు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు. ఆయ‌నే ఏఆర్ రెహ్మాన్. బ‌తుక‌మ్మ తో జాతిని జాగృతి చేసే పాట‌ను తాను రూపొందిస్తున్నానని వెల్ల‌డించారు.

 బ‌తుకు ఇచ్చే త‌ల్లికి వంద‌నం.. ప‌ల్లె దారుల్లో న‌డిపించే పండుగ‌కు వంద‌నం.. బ‌తుక‌మ్మ బతుక‌మ్మ ఉయ్యాలో మా త‌ల్లి బ‌తుకమ్మ ఉయ్యాలో అని పాడుకోవాలి మ‌నం..అవును! త‌ల్లికి వంద‌నాలు చెబుతూ, ప్ర‌కృతి పాట‌కు వంద‌నాలు చెబుతూ చేసే ప్ర‌యాణం ఈ రోజు నుంచి తెలంగాణ వాకిట ప్రారంభం కానుంది. తీరున్నొక్క పూల‌తో ఆ త‌ల్లిని కీర్తించే పండుగ‌కు సంబంధించి ఇప్పుడొక మంచి వార్త విశేష సంబంధం అయిన వార్త వెలుగు చూసింది. బతుక‌మ్మ పాట‌కు సంబంధించి కొత్త‌గా రాయించే సాహిత్యానికి స్వ‌రాలు స‌మ‌కూర్చే బాధ్య‌త‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు ఏఆర్ రెహ్మాన్ అందుకున్నారు. ఆయ‌న స్వ‌ర‌క‌ర్త‌గా ఉంటూ రూపొందే పాట‌ను మ‌రో ప్రముఖ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మేన‌న్ పిక్చ‌రైజ్ చేయ‌నున్నారు. దీన్నొక అరుదైన గౌర‌వంగా తాను భావిస్తున్నాన‌ని చెప్పారు ఏఆర్ రెహ్మాన్. ఈ మేర‌కు తెలంగాణ జాగృతి ఆనందం వ్య‌క్తం చేస్తుంది. త‌మ పాట‌కు ఆస్కార్ అవార్డు గ్ర‌హీత రెహ్మాన్ స్వ‌రాలు కూర్చ‌డం దేశ విదేశాల్లోనూ త‌మ సంస్కృతి మ‌రింత ప్రాచూర్యం ద‌క్కించుకునేందుకు ఓ గొప్ప అవ‌కాశం అని అంటున్నారు క‌వితక్క కార్య‌క‌ర్త‌లు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: