మలబద్ధకం సమస్య తగ్గాలంటే ఇవి తినండి?

Purushottham Vinay
పేగుల ఆరోగ్యానికి జొన్నలు అనేవి చాలా బాగా పని చేస్తాయి. ఎందుకంటే ఇవి గ్లూటెన్ రహితం. ప్రోటీన్స్, సూక్ష్మపోషకాలు ఇంకా అలాగే ఐరన్ తో పాటు మరెన్నో పోషకాలను కూడా అందిస్తుంది. గోధుమ కంటే ఇవే చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఇంకా అంతేగాక జీవక్రియని పెంచడంలో సహాయపడతాయి. అజీర్ణం, మలబద్ధకం సమస్యలు ఉన్నట్లయితే గోధుమలు ఇంకా అలాగే మైదాకి దూరంగా ఉండాలి. దానికి బదులుగా జొన్న పిండి తీసుకోవచ్చు.ఇంకా అలాగే నలుపు రంగు ఎండు ద్రాక్ష కూడా మంచి డైటరీ ఫుడ్. ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఇంకా అలాగే విటమిన్లు ఇందులో చాలా పుష్కలంగా ఉన్నాయి. గట్ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యని నివారించడానికి రాత్రిపూట 5 నుంచి 6 నల్ల ఎండుద్రాక్ష నానబెట్టుకుని పొద్దున్నే వాటిని తినాలి.ఇంకా అలాగే మీరు అంజీర్ నానబెట్టుకుని తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.ఎందుకంటే ఇది ఇది వాత, పితాలని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇక ఈ పండు రబ్బరు పాలని ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో ఎంజైమ్ ఫిసిన్ అనేది ఉంటుంది.


ఇది పొట్టలో ఏర్పడే పురుగులతో పోరాడే శక్తివంతమైన యాంటెల్మింటిక్ ని కూడా కలిగి ఉంటుంది.ఇంకా మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుంచి బయటపడేసేందుకు అంజీరా చాలా బాగా ఉపయోగపడుతుంది.దీన్ని రాత్రంతా కూడా నానబెట్టి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా పేగుల ఆరోగ్యానికి గోరువెచ్చని నీరు లాగా పని చేస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరిచి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో ఈ గోరువెచ్చని నీళ్ళు బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే చల్లని నీటిని తాగినప్పుడు మొత్తం జీర్ణవ్యవస్థ ఇంకా ఎంజైమ్ స్రావాన్ని నెమ్మదించేలా చేస్తుంది. చల్లటి నీళ్ళ వల్ల కడుపు ఉబ్బరం ఇంకా అలాగే రోజంతా అలసటగా ఉండటంతో పాటు చాలా బరువుగా అనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం గోరువెచ్చని నీళ్ళు అనేవి ఆకలిని ప్రేరేపిస్తాయి. మూత్రాశయాన్ని బాగా శుభ్రపరిచి జీర్ణక్రియకి బాగా తోడ్పడుతుంది. వాత, కఫ దోషాల నుంచి కూడా మంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అందుకే రోజంతా కూడా గోరు వెచ్చని నీటిని తాగడం చాలా ముఖ్యమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: