కిడ్నీ ప్రాబ్లెమ్స్ : ఈ డ్రింక్స్ తాగితే రానే రావు?

Purushottham Vinay
ఇక కిడ్నీలకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మూత్రపిండాల వైఫల్యం ఇంకా రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల ఆహారంలో మార్పులు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పలు డిటాక్స్ డ్రింక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. మూత్రపిండాలు శుభ్రంగా ఉంచడంలో సహాయపడే డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఏలకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొందరికి మాత్రమే తెలుసు. కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత అనేది ఉండదు. మరోవైపు, ఈ ఏలకులు తీసుకోవడం వల్ల మీ శరీరంలోని బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. అందుకే నోటి నుంచి వచ్చే వాసన ఈజీగా ఆగిపోతుంది. కానీ కొబ్బరి, యాలకుల కలయిక మూత్రపిండాలకు చాలా మేలు చేస్తుంది.ఈ కొబ్బరి నీళ్లలో ఏలకులు కలిపి తాగడం వల్ల కిడ్నీలు డిటాక్సిఫై అవుతాయి. కొబ్బరి నీళ్లను తాగే ప్రతిసారీ దానికి కొంచెం యాలకుల పొడిని కనుక కలపి తీసుకుంటే చాలామంచిది.


ఇంకా అలాగే కొత్తిమీర ఆహారం రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అల్లం కూడా పలు సమస్యలను నుంచి ఈజీగా కాపాడుతుంది. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా చాలా బలపడుతుంది. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడానికి అల్లం ఇంకా కొత్తిమీర మంచిదిగా పరిగణిస్తారు. దీనికోసం కొంచెం అల్లం ఇంకా కొత్తిమీరను నీళ్లలో వేసి మరిగించాలి. ఈ కషాయం తీసుకోవడం ద్వారా కిడ్నీలను చాలా శుభ్రం చేసుకోవచ్చు.ఇంకా అలాగే నిమ్మకాయ కూడా మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఉదరానికి సంబంధించిన సమస్య ఏదైనా నిమ్మకాయతో ఈజీగా తగ్గించుకోవచ్చు. నిమ్మకాయలోని విటమిన్ సి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగించేందుకు ఇంకా అలాగే కిడ్నీ డిటాక్స్ కోసం నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగాలి.కాబట్టి ఈ డ్రింక్స్ ఖచ్చితంగా తాగండి. ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: