లైఫ్ స్టైల్: వంటింట్లో దొరికే వీటిని తింటే తెల్లరక్త కణాలు పెరుగుతాయట..!

Divya
ప్రస్తుత సమయంలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరిగి పోతుండటంతో ప్రజలలో పరిస్థితి చాలా ఆందోళన కరంగా మారింది. డెంగ్యూ వ్యాపించిన వ్యక్తి లో కనిపించే సాధారణ లక్షణాల విషయానికి వస్తే..కళ్ళ వెనుక నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి ,వికారం, వాంతులు, దద్దుర్లు ,కీళ్లనొప్పులు వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన కడుపునొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.ముఖ్యంగా చిగుళ్ళలో రక్తస్రావం, వాంతిలో రక్తం పడడం, నిరంతరంగా వాంతులు అవ్వడం, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
అయితే డెంగ్యూ చికిత్స కి నిర్దిష్టమైన చికిత్స లేదు.. కాబట్టి డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలంటే మాత్రం కొన్ని వంటింటి చిట్కాలను తప్పకుండా ఉపయోగించాల్సిందే.
మెంతులు:
డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించడంలో మెంతి గింజలు చాలా బాగా సహాయపడుతాయి. మెంతి గింజల లో ఎన్నో పోషకాలు ఉంటాయి.. కాబట్టి ఒక కప్పు వేడి నీటిలో మెంతులు నానబెట్టి , ఆ నీటిని చల్లబరిచి  రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మెంతి నీటి ద్వారా మనకు విటమిన్ సి, విటమిన్ కె , ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. ఒక ఈ మెంతి నీటిని తాగడం వల్ల జ్వరం తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, ఆకలి లేకపోవడం, జీర్ణ సమస్యలు, బాధాకరమైన రుతుస్రావం, జీర్ణ సమస్యలు ,పాలిసిస్టిక్ అండాశయం సిండ్రోం ,అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్య, గుండెపోటు వంటి అతి భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా ఈ మెంతి నీరు బయట పడేస్తుంది. ఇక చర్మానికి, జుట్టుకు కూడా మెంతి మీరు చాలా బాగా పనిచేస్తాయి.
వేప ఆకుల రసం తాగడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల తో పాటు ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతుంది. డెంగ్యూ జ్వరం తగ్గి పోయే అవకాశం కూడా ఉంటుంది.కాబట్టి వీటిని తప్పకుండా తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: